google.com, pub-4206855737893127, DIRECT, f08c47fec0942fa0 google.com, pub-4206855737893127, DIRECT, f08c47fec0942fa0
5.6 C
New York
శుక్రవారం, ఫిబ్రవరి 28, 2025

Buy now

spot_img

డిజిటల్‌ ప్రావీణ్యం ద్వారా విద్యార్థులను శక్తివంతం కావాలి

అనకాపల్లి : డిజిటల్‌ నైపుణ్యంతో విద్యార్థులు శక్తివంతం కావాలని ఎ.ఎం.ఎ.ఎల్‌.కళాశాల రసాయన శాస్త్ర మాజీ విభాగ అధిపతి కొయిలాడ రామ్మోహనరావు పేర్కొన్నారు. శ్రీ గౌరీ గ్రంథాలయంలో కంప్యూటర్‌ శిక్షణ తరగతులను ఆయన బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ప్రపంచానికి అనుగుణంగా, అవసరమైన కంప్యూటర్‌ శిక్షణను అందిపుచ్చుకోవాలన్నారు. విద్యార్థులు ప్రాథమిక అంశాలను గ్రహించడమే కాకుండా విభిన్న సందర్భాలలో వివిధ కంప్యూటర్‌ అప్లికేషన్‌లను ఎలా అన్వయించుకోవాలో కూడా అర్థం చేసుకోవాలన్నారు. ఆచరణాత్మక వ్యాయామాల ద్వారా సంభావిత అవగాహనను పెంపొందించుకోవాలన్నారు. వయస్సుతో సంబంధం లేకుండద కంప్యూటర్‌ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలన్నారు. డిజిటల్‌ యుగంలో విద్యార్థులకు అవసరమైన విజ్ఞానం, సామర్థ్యాలను సమకూర్చుకోవాలన్నారు. విద్యతో ఆసక్తిని మిళితం చేయడం ద్వారా, ఆధునిక ప్రపంచంలోని అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులను శ్రీ గౌరీ గ్రంథాలయం ప్రొత్సహిస్తుందని రామ్మోహనరావు పేర్కొన్నారు. శ్రీ గౌరీ గ్రంథాలయం కార్యదర్శి కాండ్రేగుల వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రంథాలయ అధ్యక్షుడు డి.నూకఅప్పారావు, సభ్యులు సామాజికవేత్త పిళ్లా కొటేశ్వరరావు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుగ్రహీత కొణతాల ఫణిభూషణ్‌ శ్రీధర్‌, శిక్షకులు శరగడం కిశోర్‌, ఇ.ఇందిర, కె.నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

google.com, pub-4206855737893127, DIRECT, f08c47fec0942fa0
google.com, pub-4206855737893127, DIRECT, f08c47fec0942fa0